ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కన్నా

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కన్నా

PLD: సత్తెనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇందులో పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఇళ్లు, పెన్షన్, వైద్య సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలా కాకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తామని అన్నారు.