ఆల్ ఇండియా లక్షద్వీప్ NCC క్యాంప్కు బస్వాపూర్ అమ్మాయి
KMR: భిక్కనూర్ మండలం బస్వాపూర్కు చెందిన విద్యార్థిని వైష్ణవి NCCలో ఆలిండియా లక్షద్వీప్ క్యాంప్కు ఎంపికైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 11 మందిలో వైష్ణవి ఉండటంతో ఆమెను గ్రామస్థులు అభినందించారు. వైష్ణవి ఆల్ ఇండియా లక్షద్వీప్ క్యాంప్కు సెలక్ట్ కావడం గ్రామానికి కాకుండా జిల్లాకే ఆదర్శమన్నారు.