తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు 17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 60,098 మంది స్వామిని దర్శించుకున్నారు. 24,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లుగా నమోదైంది.