వాజేడులో 63 కేవిఏ త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు...!
MLG: వాజేడు మండలంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు అదనపు 63 కేవిఏ త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు చేపడుతున్నామని డివిజనల్ ఇంజినీర్ జె. పురుషోత్తం తెలిపారు. PM-DA JGUA పథకం ద్వారా మీటర్లు లేని గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ మీటర్లు అందజేస్తామని ఆయన వెల్లడించారు.