నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలిగా కల్పలతా రెడ్డి

కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారు. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. కర్నూలు పార్లమెంట్కు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్కు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డిని పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.