యాదాద్రిలో కొనసాగుతున్న కార్తీక మాస వ్రతాల సందడి

యాదాద్రిలో కొనసాగుతున్న కార్తీక మాస వ్రతాల సందడి

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్షేత్రంలో వ్రతాన్ని ఆచరిస్తే పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నిత్యం ఆరు బ్యాచ్లుగా వ్రతం చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఒక్కరోజే ఈ వ్రతాల ద్వారా దేవస్థానానికి రూ.4,42,000 ఆదాయం వచ్చిందన్నారు.