స్వామివారి సేవలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్

స్వామివారి సేవలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్

CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ సెక్రటరీ చిన్న రాములు ఐఏఎస్, సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు పాల్గొన్నారు.