రామ్నగర్లో హెచ్పీవీ టీకాల పంపిణీ
సత్యసాయి: ధర్మవరంలోని రామ్నగర్లో హెచ్పీవీ (HPV) టీకాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం బీజేపీ నేత హరీశ్ బాబు పాల్గొని టీకాల ప్రక్రియను పరిశీలించారు. బాలికల భవిష్యత్ ఆరోగ్య భద్రతకు హెచ్పీవీ టీకాలు కీలకమని ఆయన తెలిపారు. 14–15 ఏళ్ల బాలికలకు ఈ టీకాలు వేయడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.