మహిళా రైతులకు పురస్కారాలు ప్రదానం
TG: మహిళా రైతులను ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా రైతు మేళా-2026ను ఆయన ప్రారంభించారు. సహజ వ్యవసాయం చేసే మహిళా రైతులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 27 మంది మహిళా రైతులకు పురస్కారాలు ప్రదానం చేశారు.