పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్
TPT: తిరుపతిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 43వ బోర్డు సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాలన్నారు.