దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి: పన్నాల

HYD: మల్లాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో ఎంటమాలజీ సిబ్బందితో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్లోని ప్రజలు డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంటమాలజీ సిబ్బందికి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సూచించారు.