ఢిల్లీ ఘటన.. పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ ఘటన.. పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం

బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3,70,13,556 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే, ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.