జిల్లాలో 9 గం.ల వరకు నమోదైన పోలింగ్
NLG: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 28.15 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.