'2026 చివరికి వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం'
AP: 2026 చివరికి వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రెండో టన్నెల్లో లైనింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో రూ.4 వేల కోట్లు అవసరమని అన్నారు. బడ్జెట్తో సంబంధం లేకుండా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.