కూటమిలో ఉన్నా కాబట్టే ఓపిక పట్టా: బాలినేని

కూటమిలో ఉన్నా కాబట్టే ఓపిక పట్టా: బాలినేని

AP: టీడీపీ MLA దామచర్ల వ్యాఖ్యలపై జనసేన నేత బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 'దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. కూటమిలో ఉన్నా కాబట్టే 16 నెలలుగా ఓపిక పట్టా. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను. సైలెంట్‌గా ఉన్న నన్ను రెచ్చగొట్టారు. దామచర్ల అవినీతి వ్యవహారాలన్నీ బయటపెడతా' అని వెల్లడించారు.