జనగామలో 91% రెన్యూవల్, 5 లక్షల బీమా భరోసా

జనగామ జిల్లాలో రైతు భీమా పథకం కింద 1,27,418 మంది రైతులు నమోదు చేసుకున్నారు. సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 91.08% రెన్యూవల్ పూర్తయ్యాయి. అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు 10 రోజుల్లోగా ఎస్ఐసీ ద్వారా రూ. 5 లక్షల బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే అనేక కుటుంబాలు ఆర్థిక భద్రత పొందాయ.