VIDEO: రామన్నగూడెం వద్ద మొదటి హెచ్చరిక జారీ

MLG: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 15.520 మీటర్లు ఉందని బుధవారం అధికారులు తెలిపారు. రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు.