అంబేద్కర్ కాలనీలో నీటి కష్టాలు
NZB: రుద్రూర్లోని అంబేద్కర్ కాలనీలో 2 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కాలనీవాసులు వాపోయారు. పైపులైన్ పగిలి నీరు వృథాగా పోయి సుమారు 25 కుటుంబాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి, తాగునీరు అందించాలని కోరుతున్నారు.