గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు: ఎంపీ
NRPT: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని ఎంపీ డికే అరుణ అన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో గురువారం ఉపాధిహామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ పాల్గొన్నారు.