శాంతియుతంగా రంజాన్ వేడుకలు జరుపుకోవాలి: ఎస్సై
VKB: రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో పాటు సోదరభావంతో జరుపుకోవాలని ధారూర్ ఎస్సై రాఘవేందర్ ప్రజలను కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుతూ మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించాలని తెలిపారు. ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.