దివ్యాంగుల సహాయ పరికరాలకు గడువు పెంపు
సూర్యాపేట జిల్లాలోని దివ్యాంగులకు 2024-25 సంవత్సరానికి గానూ ప్రభుత్వం అందించే సహాయ పరికరాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించినట్లు ఈరోజు జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు తెలిపారు. మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల కోసం అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.