రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి: ఎమ్మెల్యే

రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి: ఎమ్మెల్యే

కోనసీమ: రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. బుధవారం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకం రైతులకు ఊరటనిస్తోందని అన్నారు.