BREAKING: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.170 పెరిగి రూ.1,23,170కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,12,900గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.1,68,000 వద్ద కొనసాగుతోంది.