ఆన్లైన్ టాస్క్ పేరుతో రూ. 2.74 లక్షల టోకరా
KMR: టెలిగ్రామ్లో వచ్చిన లింకును ఓపెన్ చేసి దోమకొండకు చెందిన వ్యక్తి శుక్రవారం సైబర్ మోసానికి గురయ్యారు. 'గుబిభో' అనే యాప్లో టాస్క్లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. కొన్ని టాస్క్లు పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్లు చూపించారు. బాధితుడు రూ. 2.74 లక్షలు పంపించాడు. మోసపోయానని గ్రహించి PSను ఆశ్రయించాడు.