జిల్లా వ్యాప్తంగా 58.68% ఓట్లు నమోదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. 11 గంటల వరకు ఘనపూర్ ములుగు 51.41%, గోరి కొత్తపల్లి 64.45%, మొగుళ్ళపల్లి 57.92%, రేగొండ 63.51% జిల్లా వ్యాప్తంగా 58.68% ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు ప్రతీ క్షణం నిఘా పెట్టారు.