అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ అండ: MLA
ADB: ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద సోమవారం నివాళులర్పించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అధికారిక సంస్మరణ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రమాణస్వీకారం రోజునే స్మృతివనం ఏర్పాటుకు రూ. 1 కోటి కేటాయించారని గుర్తుచేశారు.