245కు పైగా వాహనాలపై కేసులు నమోదు
TG: రాష్ట్ర వ్యాప్తంగా 245కు పైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో 180 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. వాటిల్లో 40 ఓవర్ లోడ్తో తిరిగే వాహనాలున్నాయన్నారు. మిగిలినవి ఫిట్ నెస్, టాక్స్, పర్మిట్ తదితర పత్రాలు లేని వాహనాలని చెప్పారు. ఓవర్ లోడ్తో తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.