15న ఎంజీ యూనివర్సిటీ స్నాతకోత్సవం

NLG: ఈ నెల 15న ఎంజీ యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం తెలిపారు. కాన్వకేషన్కు ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వక్తగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొ. బి.ఎస్ మూర్తి హాజరవుతారని అన్నారు. 57 మందికి గోల్డ్ మెడల్స్, 22 మందికి పీహెచ్డీ పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.