వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన
KDP: జిల్లా సి.కె దిన్నె సర్కిల్ పరిధిలో సి.ఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అధిక శబ్దం చేసే సైలెన్సర్లు ఉపయోగిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.