గవర్నర్కు ఘన స్వాగతం పలికిన మంత్రులు
SS: పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు మంత్రులు సవిత, భరత్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. జేఎన్టీయూలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, SP సతీష్ కుమార్ పాల్గొన్నారు.