సీఐ మల్లేశ యాదవ్ అవగాహన కార్యక్రమం
CTR: కుప్పం రూరల్ సీఐ మల్లేశ యాదవ్ గుడిపల్లి మండలం గుట్టర్లపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజా భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.