'దేవస్థానం అభివృద్ధికి ట్రస్ట్ సభ్యులు కృషి చెయ్యాలి'
PPM: తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి సభ్యులంతా కృషి చేయాలని కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సూచించారు. శనివారం తోటపల్లిలో శ్రీ వేంకటేశ్వర స్వామి, కోదండరామ స్వామి దేవస్థానాలకు చెందిన ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులుకు ప్రభుత్వ నియామక పత్రాలను ఆమె విడుదల చేశారు. ఈ మేరకు నూతన ఛైర్మన్గా మార్కొండ ఫకీర్ నాయుడు నియమితులైయ్యారు.