గ్రీవెన్స్లో వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

WGL: వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే వినతులు స్వీకరించారు. నగర ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో నేరుగా మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. నగరవాసులు అందజేసిన సమస్యలపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని త్వరత్వరగా పరిష్కరించాలని సూచించారు.