ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
MLG: కాకులమర్రి లక్ష్మణ్ బాబు–శ్రీలత దంపతులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రామాలయం వద్ద వెలసిన ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంతో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాన్ని పూర్తిగా తమ సొంత నిధులతో నిర్మిస్తామని తెలిపారు.