VIDEO: ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత బయటపడింది: అంబటి
GNTR: వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత బయటపడిందని మాజీ మంత్రి రాంబాబు తెలిపారు. నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల పత్రాలను బృందావన్ గార్డెన్స్లోని జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అంబటి, నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా మాట్లాడారు. సేకరించిన పత్రాలను 15న తాడేపల్లికి, అక్కడి నుంచి 17న గవర్నర్కు పంపిస్తామని తెలిపారు.