శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల వేంకటేశ్వరుడిని 51,082 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 19,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.