ఎర్రగడ్డ డివిజన్లో కేంద్ర మంత్రి ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని స్థానికులను కోరారు.