'సేంద్రీయ వ్యవసాయంతో అధిక ప్రయోజనాల'

తిరుపతి: మహిళా విశ్వవిద్యాలయంలో సోమవారం యన్ఎస్ఎస్ యూనిట్స్ 1,9,10,12 ఆధ్వర్యంలో అంతర్జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్డ్ సంస్థ కార్యదర్శి డా. గంగాదరం మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయ పంటలు పండించడం వలన భూమి సారవంతంగా ఉంటుందని సేంద్రియ ఉత్పత్తులు వాడకం ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.