భారత్కు మరో 16,714 టన్నుల ఎల్పీజీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్కు ఊరటనిస్తూ మరో భారీ ఎల్పీజీ కార్గో షిప్ 'పైక్సిస్ పయనీర్' న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. అమెరికాలోని టెక్సాస్ ఉంచి ఫిబ్రవరి 14న బయల్దేరిన ఈ నౌక ద్వారా ఏజిస్ లాజిస్టిక్స్ సంస్థ 16,714 టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుండటం గమనార్హం.