ఆవులు ఢీ కొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయాలు
మార్కాపురంలో ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ గుర్తుతెలియని మహిళను బలంగా ఢీ కొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆవుల బెడద ఎక్కువైందని పలుమార్లు వార్తా కథనాలు ఇచ్చిన.. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థలం మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగింది.