యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించిన ఎమ్మెల్యే

యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించిన ఎమ్మెల్యే

JN: యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.