'జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి'

ప్రకాశం: సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ తెలిపారు. మంగళవారం కోర్టు పరిధిలో ఉన్న న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేలా చూడాలని న్యాయ వాదులకు సూచించారు.