'పీఏడీపై డయాబెటిస్ బాధితులకు అవగాహన అవసరం'
GNTR: డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్తప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని యశోదా హాస్పిటల్ ఎండోవాస్కులర్ సర్జన్ డా. ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. నేడు గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటిస్ ఉన్న వారిలో పిరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, నరాల సమస్య కారణంగా నొప్పి లేకపోవడం, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని కోరారు.