బాల్కొండ గ్రంథపాలకురాలిగా వరలక్ష్మి

బాల్కొండ గ్రంథపాలకురాలిగా వరలక్ష్మి

NZB: బాల్కొండ మండల కేంద్రంలోని గ్రంథాలయ నూతన కేంద్ర పాలకురాలిగా వరలక్ష్మి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్మూర్ నుంచి బదిలీపై ఆమె ఇక్కడికి రాగా, గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన స్వామి ఆర్మూర్ గ్రంథాలయానికి వెళ్లారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యాలయంలోని పుస్తకాలు, రికార్డులు, ఫర్నిచర్‌ను ఆమెకు అప్పగించారు. రీడర్లకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.