'సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి'

'సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి'

KMR: గాంధారి మండలం గండిపేట్‌లో బ్యాంక్ సేవలపై బుధవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారులకు బ్యాంక్ అందించే పలు సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గుర్తుతెలియని నంబర్లకు ఓటీపీలు పంపించొద్దన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.