VIDEO: మూసీ వరద నీటిలో మునిగిపోయిన ఆలయం

HYD: మూసీ నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో లంగర్ హౌస్ బాపు ఘాట్ నుంచి పురానాపూల్ వరకు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బాపు ఘాట్ వద్ద మూసీ మధ్యలో ఉన్న ఆలయం, పురానాపూల్ వద్ద మూసీ మధ్యలో ఉన్న దేవాలయాలు వరద నీటిలో మునిగిపోయాయి. కాగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.