పెరుమాలపల్లిలో చెంగారెడ్డి సంస్మరణ సభ

పెరుమాలపల్లిలో చెంగారెడ్డి సంస్మరణ సభ

TPT: మాజీ టీటీడీ డిప్యూటీ ఈవో అంచపరెడ్డి చెంగారెడ్డి పెద్దకర్మ కార్యక్రమం పెరుమాలపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని చెంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.