ఎయిరిండియా కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మే 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది. విమానాలను రద్దు చేయడంతో ఇజ్రాయెల్లో నివసిస్తోన్న 40 వేలకు పైగా భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.