VIDEO: అమ్మవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.