ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే
NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆర్జీలకు చట్టపరంగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.